యంగ్ టాలెంట్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న “తిమ్మరుసు” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 30న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం సినిమా హాళ్ళలో రిలీజ్ అయ్యే మొదటి తెలుగు సినిమా “తిమ్మరుసు” కానుంది. కాగా ఇందులో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. Read Also :…