Home
Shamshabad Airport
Shamshabad Airport News
-
చెన్నై, హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో బంగారం సీజ్
స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు.… -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆంక్షలు.. వారికి నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి…
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆంక్షలు విధించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్రమత్తం అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి. ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. Read: ఈ నౌకకు ఇంధనం అవసరం లేదు… ఎంత దూరమైనా… ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే… -
టాయ్ కార్, వాచ్ లో బంగారం తరలింపు
బంగారం, హెరాయిన్, గంజాయి.. అక్రమార్కులకు ఇవే పెద్ద ఆదాయ వనరులు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. స్మగ్లర్లు దొరికిన చిన్నవస్తువులోనైనా బంగారం దాచేసి తెచ్చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. అయితే, కస్టమ్స్ అధికారులు వీరి ఆటలు సాగనివ్వడం లేదు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా పట్టుబడుతోంది అక్రమ బంగారం. READ ALSO గోల్డ్ స్మగ్లింగ్.. కేటుగాళ్ళ రూటే సెపరేటు అక్రమార్కులు వివిధ మార్గాలను ఎంచుకుని బంగారాన్ని విదేశాల నుండి తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా… -
శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముంబై వయా హైదరాబాద్ మీదుగా జగ్దల్ పూర్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గత మూడు గంటలుగా ఎయిర్పోర్ట్ లో పడి కాపులు కాస్తున్న ప్రయాణీకులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఎయిర్పోర్ట్ లో బైఠాయించారు ప్రయాణీకులు. ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా… -
శంషాబాద్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 13 లక్షల విలువ చేసే సౌదీ రియాల్ గుర్తించారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా విదేశీ కరెన్సీ తీసుకువచ్చాడు ప్రయాణికుడు. బట్టలలో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీని దాచిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది స్క్రీనింగ్ లో పట్టుబడింది విదేశీ కరెన్సీ. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కేసు… -
శంషాబాద్ విమానాశ్రయంలో 3 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద 3 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను ఎమర్జెన్సీ లైట్ లో అమర్చి తరలించే యత్నం చేసిన కేటుగాళ్లు. దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన ఎమర్జెన్సీ లైట్ ను లగేజ్ బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో ఎమర్జెన్సీ లైట్… -
శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్… కారణమేంటంటే..?
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసారు. అయితే విమానంలోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. అనంతరం… హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించి తనిఖీ చేయడంతో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం… -
శంషాబాద్లో రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ… -
హైదరాబాద్లో రూ.40 కోట్ల విలువైన హెరాయిన్, గంజాయి పట్టివేత..
హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం… -
బ్రేకింగ్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టించింది.. ఎయిర్పోర్ట్లో గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహకోల్పోయారు.. ఆ ముగ్గురు వ్యక్తులను ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే ఎయిర్పోర్ట్లోని ఆస్పత్రికి తరలించారు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. మరో ఇద్దరు వ్యక్తులు జాకీర్, ఇలియాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!