హైదరాబాద్ గాంధీ భవన్లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సేవాదల్ అధ్యక్షులు జితేందర్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సేవాదళ్ అధ్యక్షులు లాల్జ్ జి దేశాయ్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.