బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన 124 బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేయనున్నారు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.
Heavy Drug Seizure: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు.
అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు.…