School Bus Overturned: నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థినిలకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Bus Overturned: నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు గాయపడ్డారు. సూర్యాపేట కు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా.. నకిరేకల్ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే నుండి నల్గొండ వైపు రోడ్డు టర్న్ తీసుకుంటుండగా ఎదురుగా లారీ రావడంతో అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి నర్సింగ్ స్కూల్ బస్ అతివేగం కారణంగా భావిస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ స్కూల్ బస్సులో ఆక్యుపెన్సికి మించి విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Bhupendrabhai Patel: నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
విద్యార్థినిలకు ప్రమాదం తెలుసుకున్న తల్లిదండ్రలు హుటా హుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లారీ వస్తున్నట్లు గమనించకుండా.. బస్సులో వున్న సీట్ల పరిమాణం కన్నా ఎందుకు విద్యార్థులను ఎక్కించారని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యం దీనిపై విచారణ చేపట్టాలని అన్నారు. పరీక్షలు రాసేందుకు వెళ్తున్నానని తమ పిల్లలు బస్సు ఎక్కారని ఇంతలోనే ఈఘటన చోటుచేసుకుందని వాపోయారు. స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతోనే ఈఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యం దీనిపై స్పందించాలని కోరారు.
ఈ ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 15 మంది విద్యార్థులు గాయపడ్డారని, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్య అధికారులు మంత్రికి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
PM Modi: గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోదీ
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!