RSS: సుప్రీంకోర్టులో ప్రస్తుతం స్వలింగ వివాహాల చట్టబద్ధతపై విచారణ కొనసాగుతోంది. దీన్ని కేంద్రంతో పాటు సమాజంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇది కేవలం అర్బన్ కమ్యూనిటీలో కొంతమందికి మాత్రమే పరిమితం అయిందని, దేశంలో మెజారిటీ ప్రజల మనోభావం కాదని, చట్టబద్ధత కల్పించే హక్కు పార్లమెంట్ ది అని దీంటో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం తెలిపింది. అయితే వీరి హక్కులపై ఓ కమిటీని నియమిస్తామని ఇటీవల కేంద్ర అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.