దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘శాంసంగ్’ సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ మోడల్ ఎస్ సిరీస్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ‘గెలాక్సీ అన్ప్యాక్డ్’ పేరుతో కాలిఫోర్నియాలో బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈవెంట్లో శాంసంగ్ ఈ మూడు ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసింది. ఎస్25 అల్ట్రా ధర భారత్లో రూ.1,29,999…