కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్కు కష్టాలు తప్పేలా లేవు.నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచి వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. గతంలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై ఎందరో కంగనాపై విరుచుకుపడ్డారు. దేశంలో పలుచోట్ల నిరసనలు సైతం వ్యక్తం చేశారు. ఆఖరికి ఆమెకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం తిరిగి…