నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి జీవనశైలిని ప్రతిబింబించేలా పీరియడ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకోగా,…