నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని మనుషుల భావోద్వేగాలు, అక్కడి జీవనశైలిని ప్రతిబింబించేలా పీరియడ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 9న ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
Also Read : Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..
ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వంశీకాంత్ రేఖానా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంతో సాగే సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి, అదే బాటలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ట్రైలర్తో సినిమా కథాంశంపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.