ప్రముఖ నటుడు సాయికుమార్ తన చుట్టూ ఉన్న వారికి ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. కరోనా కష్ట కాలంలోనూ తన వంతు సాయం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయికుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, అది వేసుకుంటే ప్రాణాలకు ఢోకా ఉండదని హితవు పలికారు. ‘పోలీస్ స్టోరీ’లోని పాపులర్ డైలాగ్ ను ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ…