సాయికుమార్ ప్రధాన పాత్రలో ‘నాతో నేను’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అనంతరం చిత్ర దర్శకుడు శాంతికుమార్ తుర్లపాటి మాట్లాడుతూ, ”మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన నేను చిన్న కళాకారుడు స్థాయినుంచి ఈరోజు డైరెక్టర్ స్థాయికి వచ్చాను. దానికి కారణం నా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు. ఈ సినిమా విషయానికి వస్తే, పాండమిక్ టైమ్ లో ఒంటరితనం ఫీల్ అయిన సిట్యుయేషన్ లో ఈ కథను రాసుకున్నాను. ఎనిమిది నెలలు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి, డైలాగ్స్ వర్షన్ పూర్తి చేశాను. ఈ కథను నంద్యాలకు చెందిన ఎల్లాలు బాబు గారికి చెప్పడం జరిగింది. ఆయనకు కథ నచ్చడం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిపోయింది” అని అన్నారు.
Also Read
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ”ఈ దసరా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఉదయం నా కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ కు నేను వెళ్లి కెమెరా స్విచ్ ఆన్ చేస్తే, నేను కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తను వచ్చి కెమెరా స్విచ్చాన్ చేయడం జరిగింది. నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్, మంచి క్యాస్టింగ్ కూడా సెట్ అయ్యింది. నేషనల్ అవార్డు కూడా వచ్చేటటు వంటి మంచి స్క్రిప్టు ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి” అని చెప్పారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!