ఎల్పీజీపై ప్రజల్లో భయాలు పెరిగాయి, మరోవైపు పెట్రోల్, డీజిల్ కోసం ప్రజల్లో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో రష్యా నుండి ముడి చమురుతో నిండిన 'ఆక్వా టైటాన్', అమెరికా నుండి ఎల్పిజిని తీసుకువస్తున్న 'పైక్సిస్ పయనీర్' నౌకలు ఆదివారం ఉదయం కర్ణాటకలోని మంగళూరు ఓడరేవుకు చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు స్థిరీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది.
శ్చిమాసియా యుద్ధం వేళ ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. కానీ భారత్ మాత్రం సేఫ్ జోన్లో ఉంది. ఆయా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్కు తీపికబురు అందింది.