పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులకు రెండున్నర లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీవీతో ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి మాట్లాడారు. బస్సు ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం అన్నారు. డ్రైవర్ హెల్త్ కండిషన్, బస్సులో లోపాలున్నాయన్న దానిపై కమిటీ విచారణ జరుపుతుందన్నారు. గ్యారేజి నుంచి…