ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా “రౌడీ బాయ్స్”తో లాంచ్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కానుందట. హాట్ బజ్ ఏమిటంటే ఈ యూత్ డ్రామా మార్చి 4న ZEE5లో ప్రీమియర్ కానుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.…