ఏపీలో పీఆర్సీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలిచింది. అయితే అక్కడి పరిణామాలపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఐఏఎస్ అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. సీఎస్ సమీర్ శర్మ మమ్మల్ని అవమానించారు. నలుగురం జేఏసీల నేతలు రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళితే ఒక నిమిషం సమయం కూడా కేటాయించ లేదు. మర్యాద కోసం అయినా కూర్చోమని చెప్పలేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో…
పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు పట్టుదలగా వున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడంతో కీలకంగా మారింది. ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. పీఆర్సీ సాధన సమితికి పూర్తి…