రాపిడ్ యాక్షన్ మిషన్ ( RAM ) ఓ దేశభక్తి చిత్రం. ఈ సంవత్సరం సినిమాను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి విడుదల చేసారు. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా తెరంగేట్రం చేయగా., ధన్య బాలకృష్ణ కథానాయిక. దీపికా ఎంటర్టైన్మెంట్, OSM విజన్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మించింది. దర్శకుడిగా మిహిరామ్ వినతేయ తన మొదటి చేసిన తన పనితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. Also Read:…
5వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసిద్ధ దేశభక్తి గీతం 'దేశ్ రంగీలా'ను పాడినందుకు ఈజిప్టు అమ్మాయి కరీమాన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు. ఇండియా హౌస్లో జరిగిన వేడుకలో కరీమాన్ ఈ పాటను అందించారు. ఆమె ప్రదర్శనకు భారతీయులు, ఈజిప్షియన్ల నుంచి ప్రశంసలు లభించాయి.
Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకులకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగిన ఆయన పర్యటన జైపూర్ నగర సందర్శనతో మొదలైంది. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
Budget 2024 : దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి కొద్ది రోజుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
India-Maldives Row: ఇండియా, మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాల్దీవ్స్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా అనుకూలంగా వ్యవహరించడం, భారత్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
FNCC Flag Hoisting on Republic Day: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ 75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరి రావు జెండా ఆవిష్కరణ చేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి FNCC దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన క్లబ్ గా దినదినాభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు. ఆ అనంతరం సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే…
Republic Day Sales : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. ప్రజలు ఆన్లైన్, ఆఫ్లైన్లో చాలా షాపింగ్ చేసారు. దీని కారణంగా కొనుగోలు రికార్డు గతేడాది మించిపోయింది.
CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.