భారత గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో విధుల్లో 30వేలమందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. రాజ్ పథ్ పరిసరప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉగ్ర హెచ్చరికలతో భారీగా భద్రత ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఏర్పాట్లు వున్నాయి. ప్రతి సంవత్సరం లక్షమంది పాల్గొనేవారు. ఈసారి 6 వేలమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతాయని సమాచారం వుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.…
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని సీఎం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం’.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక,…
దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్, మరో 11 మంది పోలీసులకు పోలీసు మెడల్స్ లభించాయి.విశిష్ట సేవలందించినందుకు గానూ టీఎస్ఎస్పీ మూడో బెటాలియన్(ఇబ్రహీంపట్నం) కమాండంట్ చాకో సన్నీకి, పోలీసు ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషన్ విభాగంలోని ఐజీపీ ఆఫీస్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి. శ్రీనివాస్ రాజుకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ లభించాయి. పోలీసు మెడల్స్ పొందింది వీరే..1.షాహనవాజ్ ఖాసీం (ఐజీపీ,…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం. రిపబ్లిక్ డేకి ఎంతో సమయం లేకపోవడంతో అధికారులు భారీ ఏర్పాట్లుచేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలే కాదు విమానయాన సంస్థలు కూడా ప్రత్యేకంగా పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ విమానయాన కంపెనీ ‘గో ఫస్ట్’ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టిక్కెట్లను అత్యంత చౌకగా అందుబాటులోకి తెచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘రైట్ టూ ఫ్లై’ పేరుతో రూ.926కే విమాన ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. Read Also: రిపబ్లిక్ డే సందర్భంగా ‘హ్యాపీ’ ఆఫర్లు ఈ…
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో…
గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇప్పటికే మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇలాంటి…