తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ధరల కారణంగా దానిని వాడడానికి భయపడుతున్నారు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్ లకు చెందిన కంపెనీలు అద్భుత ఫీచర్లతో తక్కవ ధరలకే విక్రయిస్తున్నాయి. రూ. 10 వేల బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి.
ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల కాలం.. ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా.. ఎగబడి కొనేవారు కొందరైతే.. మార్కెట్లోకి వచ్చిన ఫోన్ తమ బడ్జెట్లో దొరుకుతుందా? అని ఆలోచించేవారు మరికొందరు.. తాజాగా, భారత మార్కెట్లో రెడ్మీ మరో బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసింది… క్లీన్ ఆండ్రాయిడ్ 12, హీలియో ఏ22 చిప్, వాటర్డ్రైప్-స్టైల్ నాచ్తో రెడ్మి ఏ1 పేరుతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మొబైల్ ధర రూ.6,499గా నిర్ణయించారు.. ఇక, ఈ నెల 9వ తేదీ నుంచి కొనుగోలుదారులకు…