కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో తమ పట్ల ల్యాబ్ టెక్నీషియన్, మరొక ఎంప్లాయ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.. దీనిపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు.. ల్యాబ్ టెక్నీషియన్ కల్యాణ్ చక్రవర్తి, జిమ్మి అనే ఇద్దరు ఉద్యోగులు.. తమ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు స్టూడెంట్స్.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…