రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.
Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్ప్రదేశ్ మీర్జాపూర్లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు.
Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు, భక్తులు ఈ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువురు కీలక వ్యక్తులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. సాధువులతో పాటు ఫిలిం స్టార్స్, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు దీనికి హాజరవబోతున్నారు. ఇప్పటికే యూపీ ప్రభుత్వం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలను చేసింది.
ప్రాణ ప్రతిష్ట వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) ధరంపాల్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.
NCP Chief Sharad Pawar Said I has not received an invitation of Ram Temple Inauguration: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఏదేమైనా రామాలయం ఏర్పడైనందుకు చాలా సంతోషిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. రామ…
Ayodhya Ram Mandir : అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణానికి భక్తులు భారీ విరాళాలు ఇవ్వడంతో పాటు వారి చేతనైనంత చేయూతను అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ఆలయంలో రామలాల వ్రతం, నిత్య జ్యోతి ప్రజ్వలన కోసం ఆరు వందల కిలోల ఆవు దేశీ నెయ్యిని విరాళంగా అందజేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. హిందువులంతా ఎంతో అపురూపంగా భావిస్తున్న ఈ రామ మందిర ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరగనుంది. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు ప్రధాని నివాసానికి వచ్చారు.