కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానుల అంకితభావానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో, థాంక్స్ నోట్ కూడా పోస్ట్ చేశారు. మెగా అభిమానులు కోవిడ్ -19 మహమ్మారి కాలంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. వారి శక్తి మేరకు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తున్నారు. “అభిమానులు ఈ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టపడి పని చేస్తున్న ఆ సమాజ సేవ గురించి…
ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్-ఇండియన్ చిత్రం రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పాత్ర కోసం కూడా అతను ప్రసిద్ధ నటులను ఎన్నుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమాపై పలు రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు…
కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే వారి త్యాగాన్ని అందరికి తెలియజేయాలని భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వైద్యులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని భావించిందట. ఇందులో భర్త రామ్చరణ్ని హీరోగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య”లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే శంకర్ ముందుగా కమల్ హాసన్ తో “ఇండియన్-2” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది.…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక ప్రత్యేక పాట…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు.…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల…
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు…