Home
Rajkot Test
Rajkot Test News
-
IND vs ENG: కుటుంబానికే మొదటి ప్రాధాన్యత.. రెండో ఆలోచన ఉండదు: రోహిత్
Rohit Sharma on Ravichandran Ashwin Leaving Rajkot Test: రసవత్తర క్రికెట్ మ్యాచ్లో కూడా కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇచ్చాడు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, అలాంటి వార్తలను విన్నప్పుడు రెండో ఆలోచన ఉండదని రోహిత్ పేర్కొన్నాడు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్య నుంచే అశ్విన్ చెన్నైకి వెళ్ళిపోయాడు. తిరిగి ఆదివారం జట్టుతో… -
IND vs ENG: మా బౌలర్లకు ఒకటే చెప్పా: రోహిత్ శర్మ
Rohit Sharma React on England Bazball Cricket: ఇంగ్లండ్ ప్లేయర్స్ బజ్బాల్ క్రికెట్ ఆడినా.. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండని భారత బౌలర్లకు తాను చెప్పానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని, యశస్వి జైస్వాల్ కెరీర్ను అత్యుత్తమంగా మొదలుపెట్టాడని ప్రశంసించాడు. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 434 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన చిత్తు చేసింది. దాంతో ఐదు టెస్టుల… -
IND vs ENG: రాజ్కోట్ టెస్ట్లో భారత్ ఘనవిజయం.. టెస్ట్ చరిత్రలోనే..!
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్కోట్లో ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలం చేశాడు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్… -
Yashasvi Jaiswal: ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సరసన యశస్వి జైస్వాల్!
Three sixes by an Indian batter in over in Tests: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి డబుల్ సెంచరీ బాదాడు. 231 బంతుల్లో 200 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్లతో 214 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో యశస్వి ఏకంగా 12 సిక్స్లు కొట్టడం… -
Yashasvi Jaiswal: యశస్వీ డబుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 557 పరుగులు
India declare after Yashasvi Jaiswal slams double century: రాజ్కోట్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 430/4 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (214 నాటౌట్; 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు) డబుల్ సెంచరీ బాదాడు. మరోవైపు అరంగేట్ర ఆటగాడు… -
IND vs ENG: 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం.. 2024లో మొదటి సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్!
First six for Kuldeep Yadav in International cricket: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో మొదటి సిక్స్ బాదాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో కుల్దీప్ సిక్సర్ కొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ వేసిన 56వ ఓవర్లో లాంగ్-ఆన్ వైపు భారీ సిక్సర్ కొట్టాడు. ముందుకొచ్చి మరీ సూపర్బ్ షాట్ ఆడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.… -
Ravichandran Ashwin: అభిమానులకు శుభవార్త.. అశ్విన్ వచ్చేస్తున్నాడు!
Ravichandran Ashwin return to IND vs ENG Rajkot Test: టీమిండియా అభిమానులకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేస్తున్నాడు. ఆదివారం నుంచి యాష్ జట్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్నాడు, మేనేజ్మెంట్ అతడికి మైదానంలోకి పునఃస్వాగతం పలుకుతోంది అని బీసీసీఐ పేర్కొంది. ‘కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్కోట్ టెస్ట్… -
Sarfaraz Khan: జడేజా సమన్వయ లోపం.. రనౌట్పై స్పందించిన సర్ఫరాజ్
Sarfaraz Khan React on his Run-Out with Ravindra Jadeja: అరంగేట్ర టెస్టులో దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వన్డే తరహాలో ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. 62 పరుగులు చేసిన అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్… -
Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై జై షా కీలక ప్రకటన!
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వరకు భారత జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ద్రవిడ్తో రెండేళ్ల ఒప్పందం 2023 వన్డే ప్రపంచకప్తో ముగిసింది. అయితే ప్రపంచకప్ అనంతరం జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ హెడ్ కోచ్గా కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే రాహుల్ పదవీ కాలం ఎప్పటివరకు అన్నది మాత్రం బీసీసీఐ చెప్పలేదు. తాజాగా ద్రవిడ్తో… -
Sarfaraz Khan: నా తప్పే.. సారీ సర్ఫరాజ్: జడేజా
Ravindra Jadeja React on Sarfaraz Khan Run-Out: రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (99), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (62) క్రీజులో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్ బంతిని సాధించగా స్ట్రైకింగ్లో ఉన్న జడేజా షాట్ ఆడి.. సర్ఫరాజ్ను పరుగు కోసం పిలిచాడు. మార్క్…
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!