తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆస్తి వివాదంపై క్రిమినల్ బెదిరింపు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై మండిపడ్డారు.
ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మరి వారు బాధ్యతను మరిచి వివాదాల జోలికి వెళ్తున్నారా… లేదంటే తాము లైమ్లైట్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయం దేవుడికే తెలియాలి. తాజాగా రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస