Rajasthan Minister: రాజస్థాన్ మంత్రిపై కేసు నమోదు.. ముఖ్యమంత్రిపై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Minister: తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆస్తి వివాదంపై క్రిమినల్ బెదిరింపు, కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై మండిపడ్డారు. సికార్ జిల్లా కక్రానాకు చెందిన వార్డ్ పంచాయతీ సభ్యురాలు దుర్గా సింగ్ను అపహరించి, ఆమె నుంచి ఖాళీ బ్యాంకు చెక్కును తీసుకున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ సైనిక్ సంక్షేమం, పంచాయతీ శాఖ సహాయ మంత్రి, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముఖ్యమంత్రికి తెలియకుండా తనపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మంత్రి అన్నారు.
హోంశాఖ సీఎం వద్దే ఉందని.. మంత్రిపై కేసు నమోదు చేసి ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకపోవడం సాధ్యం కాదన్నారు. తప్పుడు కేసు నమోదు చేయకూడదన్నారు. తాను ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలుస్తానని, మీరు ఏమి ప్రయత్నిస్తున్నారని అడుగుతానని విలేకరులతో అన్నారు. రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా, గతంలో బహుజన్ సమాజ్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి మారారు. అధికార యుద్ధంలో చిక్కుకున్న సచిన్ పైలట్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. పైలట్కు అనుకూలంగా మాట్లాడినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని గూడా ఆరోపించారు. రాజేంద్ర గూడా ఆగ్రహంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. కేసు దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CB-CID)కి అప్పగించబడింది.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
Child Marriages: బాల్యవివాహాలపై అసోం సర్కారు కఠిన వైఖరి.. నిరసన చేపట్టిన మహిళలు
ఆస్తి లావాదేవీకి సంబంధించి జనవరి చివరి వారంలో మంత్రి తనను ఫోన్లో దుర్భాషలాడారని బాధితురాలు దుర్గా సింగ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. మంత్రి తనను బెదిరించి, తన ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి, బ్లాంక్ చెక్కుపై సంతకం చేయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. మంత్రి దుర్గా సింగ్ తన నియోజకవర్గంలో ఒక మహిళను మోసం చేశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!