New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-చైనా-భూటాన్ సరిహద్దు (ట్రై-జంక్షన్) వద్ద తన రవాణా సౌకర్యాలను, వ్యూహాత్మక భద్రతను బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఉత్తర బెంగాల్లోని ఖునియా మోర్ నుంచి జల్ధాకా వరకు 17 కిలోమీటర్ల మేర నూతన వ్యూహాత్మక రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సుమారు రూ.272 కోట్లను మంజూరు చేసింది. ఈ రైలు మార్గం చాల్సా సమీపంలోని ఖునియా మోర్ వద్ద ప్రారంభమై, జల్పైగురి, కాలింపాంగ్ అటవీ విభాగాల మీదుగా సాగుతుంది. ఈ ప్రాజెక్టు డూయర్స్ ప్రాంతంతో పాటు జల్ధాకా, బిందు, తోడే తంగ్తా వంటి సుదూర సరిహద్దు ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ప్రాజెక్టు భౌగోళికంగా , సైనికపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. జల్ధాకా నది సిక్కింలోని జీలెప్ లా పాస్ సమీపంలో ఉన్న కుపుప్ (బిటాంగ్) సరస్సు నుంచి ఉద్భవించి భారత్, భూటాన్ , బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఈ నది జన్మస్థలం డోక్లామ్ ముక్కోణపు సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. 2017లో డోక్లామ్ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య 73 రోజుల పాటు తీవ్రమైన సైనిక ముఖాముఖి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో చైనా నిరంతరం మౌలిక సదుపాయాలను పెంచుకుంటున్న నేపథ్యంలో, భారత్ కూడా చాల్సా నుంచి సరిహద్దు వైపు సుమారు 200 కిలోమీటర్ల మేర నెట్వర్క్ విస్తరణలో భాగంగా ఈ చర్యలు వేగవంతం చేసింది.
Also Read
- Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- 7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
వర్షాకాలం ముగిసిన వెంటనే భారత రైల్వే , పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు సర్వేను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే పురోగతిలో ఉన్న సివోక్-రంగ్పో రైల్వే ప్రాజెక్టును భవిష్యత్తులో నాథూ లా పాస్ వరకు పొడిగించే ప్రతిపాదనలు ఉండగా, చైనా సరిహద్దును అనుసంధానించే రెండో కీలకమైన రైల్వే ప్రాజెక్టుగా ఈ జల్ధాకా రైలు మార్గం నిలవనుంది. ఇది సరిహద్దు భద్రతను పటిష్టం చేయడంతో పాటు స్థానిక ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.
తాజావార్తలు
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్..
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!