డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసి బాబును అరెస్ట్ చేశారు. బుధవారం ఆరు గంటల పాటు కామేపల్లి తులసి బాబుని కేసు విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో రిమాండ్ లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ తో పాటు కలిపి తులసి బాబు ని విచారించారు…
తిరుపతిలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. సోమవారం నామినేషన్ వేసిన ఆయన.. ఈరోజు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసి ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానన్నారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబులానే భారీ మెజారిటీతో నాని చంద్రగిరి ప్రజలు గెలిపించాలని కోరారు.