Flexi War in Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరులో రిజర్వాయర్లో చేపల పంపిణీ కార్యక్రమం రసా బస అయ్యింది. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ పాల్గొనకుండానే ఎంపీలు ఎమ్మెల్సీ వెనుతిరిగి వెళ్లిపోయారు. పాలేరు రిజర్వాయర్లో చేపల పిల్లలను వదిలే కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నిర్వహించవలసి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు వచ్చారు ముగ్గురు ప్రజా ప్రతినిధులు…
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత…