కేదార్నాథ్, బద్రీనాథ్లకు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు.
ఆరోపించిన రిక్రూట్మెంట్ స్కామ్లు, పేపర్ లీక్ కేసులకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం పరీక్షలలో కాపీ చేసిన వారికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని అన్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం జోషిమఠ్ పట్టణంలో భారీ పగుళ్లు ఏర్పడి ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 600 కుటుంబాలను వెంటనే ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు.
జాతీయ రహదారిపై ఉన్న గుంతల్ని తప్పించబోయి.. క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే. పంత్ను కలిసిన తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్ ఇచ్చింది.
ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు.
చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు.. రచ్చ చేస్తున్నారు.. పాఠాలు చదివే వయస్సులో మత విధ్వేషాల్లో సమిధలు అవుతున్నారు.. ఇప్పుడు హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ్యానించింది. అయితే, ఇదే సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్లో మేం మళ్లీ…
ఉత్తరాఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పుష్కర్ సింగ్ ధామి..! 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పీఠం అందుకోబోతున్నారు. ఆరెస్సెస్ దాని అనుబంధ సంఘాల్లో 33 ఏళ్ల పాటు సేవలు అందించిన పుష్కర్ సింగ్.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..! అయితే సీఎం పీఠం అందుకోబోతున్న ఆయనకు సవాళ్లు అదే స్థాయిలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రుల మార్పు ఆసక్తికరంగా మారింది. నాలుగు నెలల్లోనే మూడో వ్యక్తి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తీరత్…
నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారిన పరిస్థితి.. రెండో సీఎం రాజీనామా చేయడంతో.. మూడో సీఎం ఎవరు అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో.. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకుది బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. నిన్న తీరథ్సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకుంది.. డెహ్రాడూన్ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్ తోమర్…
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించనున్నారు.. సీఎంగా పుష్కర్ సింగ్ ధామి పేరును ఖరారు చేసింది బీజేపీ.. దీంతో.. తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న తీరథ్సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సీఎం పదవి ఖాళీ అయ్యింది.. అయితే, ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకున్నారు. డెహ్రాడూన్ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది.…