మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మీద పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా (కెపి) ప్రావిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేయమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా తనకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక విషయాలు చెప్పారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రముఖ రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు రహస్య నివేదికలో పేర్కొంది.