వికారాబాద్ లోని మూసీనదితో పాటు కాగ్నానది, కోట్ పల్లి ప్రాజెక్ట్, సర్పన్ పల్లి, నంది వాగు ప్రాజెక్టుల నీరు అలుగు పారి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ఐజీ షనవాజ్ ఖాసీం, జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కోట్ పల్లి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ధారూర్ సమీపంలోని నాగ సముందర్ వద్ద రాక పోకలు నిలిచిపోవడంతో అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూలై 7న ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మరుసటి రోజు తెలంగాణ, రాజస్థాన్లలో పర్యటించి దాదాపు రూ.50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఫైర్ అయ్యారు. తాము ఒకటి అడిగితే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరొకటి చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనుల తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈనేపథ్యంలో.. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు, ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో.. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల బుధవారం 13తో ముగిసింది. కాగా.. పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఆంధ్రా,…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6…
పాలకులు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉత్తరాంధ్ర ఉత్తమంగా ఉండాలి. వందేళ్ళ నుండి ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగానే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్దిపై చిన్న చూపు చూసాయి. భూములు ఉండి కూడా ఉత్తరాంధ్ర వాసులు దేశ వ్యాప్తంగా వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులు విడిచి పెట్టి పోలవరం గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ప్రాజెక్టుల పై ఉండటం లేదు.…
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించారు. ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు సీఎం జగన్. రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయన్నారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ…
దేశంలో మరో పెద్ద ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీలో ఇప్పటికే యమునా ఎక్స్ప్రెస్ వే ఉండగా, మరో ఎక్స్ప్రెస్ వే ను నిర్మించేందుకు సిద్ధమయింది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 464 కిమీ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును అదానీ ఎంటర్ప్రైజస్ దక్కించుకుంది. ఇందులో భాగంగా తొలిదశకింద బుధౌన్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 17 వేల కోట్లు. పీపీపీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. Read:…