మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రొయ్యల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అమెరికా సుంకాల పేరుతో గంటల వ్యవధిలో రొయ్యల రేట్లు తగ్గించిన ప్రాసెసింగ్ యూనిట్ల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట, నిడమర్రు, గణపవరం తూర్పుగోదావరి జిల్లాల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.