తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపునా లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి వచ్చారు. గోల్కొండ బోనాలతో మొదలైన బోనాలు సికింద్రాబాద్ లో ఇప్పుడు లాల్ దర్వాజ్ జరుపుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.