తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ ఈరోజు ప్రకటించింది. రాయ్పూర్లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.