Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.