Pregnancy termination: భర్త మరణంతో కుంగిపోయిన భార్య.. 27 వారాల గర్భం రద్దుకు హైకోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఎయిమ్స్ నివేదికతో.. భర్త మరణంతో భార్య తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నట్లు కోర్టు గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిస్థితి కారణంగా మానసిక సమతుల్యతను కోల్పేయే అవకాశం ఉందని, దీంతో ఆమె తనకు తాను హాని చేసుకోవచ్చని అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతివ్వాలని కోర్టును అభిప్రాయపడింది. గర్భాన్ని అలాగే కొనసాగించడం ఆమె మానసిక స్థిరత్వాన్ని దెబ్బతిస్తుందని కోర్టు చెప్పింది. ఆమె 24 వారాల గర్భదారణ గడువు దాటినప్పటికీ, మహిళ గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతి ఉందని, ఎయిమ్స్ ప్రక్రియను నిర్వహించాలని’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Read Also: Kim Jong Un: మిస్సైల్ లాంచర్ ఉత్పత్తి పెంచాలని కిమ్ ఆదేశం.. రష్యాకు ఇవ్వడానికేనా..?
తీర్పును చెప్పే సమయంలో ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేసులో సుప్రీంకోర్టు రూపొందించిన చట్టాన్ని ప్రస్తావించింది. ప్రతీ స్త్రీ కూడా తన జీవితాన్ని అంచనా వేసుకోవడం, భౌతిక పరిస్థితులలో వచ్చిన మార్పుల దృష్ట్యా , పునరుత్పత్తి హక్కు అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ చర్యను ఎంచుకునే ప్రత్యేక హక్కు ఉంటుందని పేర్కొంది. దీంట్లోనే సంతానోత్పత్తి నిరాకరించే హక్కు కూడా ఉంది. అయితే ప్రస్తుతం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని, దీనిని ఒక ఉదాహరణగా భావించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. 23 ఏళ్ల యువతి 2023లో తన భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?