Pregnancy termination: భర్త మరణంతో కుంగిపోయిన భార్య.. 27 వారాల గర్భం రద్దుకు హైకోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఎయిమ్స్ నివేదికతో.. భర్త మరణంతో భార్య తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నట్లు కోర్టు గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిస్థితి కారణంగా మానసిక సమతుల్యతను కోల్పేయే అవకాశం ఉందని, దీంతో ఆమె తనకు తాను హాని చేసుకోవచ్చని అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతివ్వాలని కోర్టును అభిప్రాయపడింది. గర్భాన్ని అలాగే కొనసాగించడం ఆమె మానసిక స్థిరత్వాన్ని దెబ్బతిస్తుందని కోర్టు చెప్పింది. ఆమె 24 వారాల గర్భదారణ గడువు దాటినప్పటికీ, మహిళ గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతి ఉందని, ఎయిమ్స్ ప్రక్రియను నిర్వహించాలని’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
Read Also: Kim Jong Un: మిస్సైల్ లాంచర్ ఉత్పత్తి పెంచాలని కిమ్ ఆదేశం.. రష్యాకు ఇవ్వడానికేనా..?
తీర్పును చెప్పే సమయంలో ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేసులో సుప్రీంకోర్టు రూపొందించిన చట్టాన్ని ప్రస్తావించింది. ప్రతీ స్త్రీ కూడా తన జీవితాన్ని అంచనా వేసుకోవడం, భౌతిక పరిస్థితులలో వచ్చిన మార్పుల దృష్ట్యా , పునరుత్పత్తి హక్కు అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ చర్యను ఎంచుకునే ప్రత్యేక హక్కు ఉంటుందని పేర్కొంది. దీంట్లోనే సంతానోత్పత్తి నిరాకరించే హక్కు కూడా ఉంది. అయితే ప్రస్తుతం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని, దీనిని ఒక ఉదాహరణగా భావించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. 23 ఏళ్ల యువతి 2023లో తన భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!