Pregnancy termination: భర్త మరణంతో కుంగిపోయిన భార్య.. 27 వారాల గర్భం రద్దుకు హైకోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఎయిమ్స్ నివేదికతో.. భర్త మరణంతో భార్య తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నట్లు కోర్టు గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిస్థితి కారణంగా మానసిక సమతుల్యతను కోల్పేయే అవకాశం ఉందని, దీంతో ఆమె తనకు తాను హాని చేసుకోవచ్చని అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతివ్వాలని కోర్టును అభిప్రాయపడింది. గర్భాన్ని అలాగే కొనసాగించడం ఆమె మానసిక స్థిరత్వాన్ని దెబ్బతిస్తుందని కోర్టు చెప్పింది. ఆమె 24 వారాల గర్భదారణ గడువు దాటినప్పటికీ, మహిళ గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతి ఉందని, ఎయిమ్స్ ప్రక్రియను నిర్వహించాలని’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Kim Jong Un: మిస్సైల్ లాంచర్ ఉత్పత్తి పెంచాలని కిమ్ ఆదేశం.. రష్యాకు ఇవ్వడానికేనా..?
తీర్పును చెప్పే సమయంలో ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేసులో సుప్రీంకోర్టు రూపొందించిన చట్టాన్ని ప్రస్తావించింది. ప్రతీ స్త్రీ కూడా తన జీవితాన్ని అంచనా వేసుకోవడం, భౌతిక పరిస్థితులలో వచ్చిన మార్పుల దృష్ట్యా , పునరుత్పత్తి హక్కు అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ చర్యను ఎంచుకునే ప్రత్యేక హక్కు ఉంటుందని పేర్కొంది. దీంట్లోనే సంతానోత్పత్తి నిరాకరించే హక్కు కూడా ఉంది. అయితే ప్రస్తుతం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని, దీనిని ఒక ఉదాహరణగా భావించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. 23 ఏళ్ల యువతి 2023లో తన భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!