చెన్నైలో ఆన్లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్పై ఉన్న టీవీ కేబుల్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.