ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో గ్యాస్ వినియోగదారులకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గృహ అవసరాల కోసం సిలిండర్ల బుకింగ్, డెలివరీ కోసం నిరీక్షించే అవసరం లేకుండా, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ (PNG) సరఫరా చేసే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైపులైన్ గ్యాస్ కనెక్షన్ల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో…