వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు.
అభిమానం హద్దులు దాటితే అలాగే వుంటుంది. గతంలో రికార్డింగ్ డ్యాన్సుల సమయంలో అభిమానులు కరెన్సీ నోట్లు చల్లుతూ వుంటారు. తాజాగా కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు కరెన్సీ నోట్లతో స్వాగతం పలికారు ఆయన అభిమానులు. మామిడికుదురు మండల వైఎస్సార్సీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు భారీగా కరెన్సీ నోట్లు తెచ్చి రోడ్లమీద చల్లుతూ స్వాగతం పలకడం హాట్ టాపిక్ అవుతోంది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ రాక…