ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా నేత సరస్వతి సర్కార్పై జరిగిన దాడిని కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన గూండాలే దాడి చేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకురాలి తలకు గాయమై రక్తస్రావం అవుతున్న వీడియో వైరల్గా మారింది.