కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్గా మారిపోయింది..
ఆంధ్రప్రదేశ్లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు.
పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి పెనమలూరుతో నాకు సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.. వంగవీటి రంగా అనుచరుడిగా నేను ఇక్కడి వారికి పరిచయమే అన్నారు మంత్రి జోగి రమేష్
జోగి రమేష్.. నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు.. జోగి ఇంఛార్జి అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయ్యింది.. అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్ తొలి పర్యటన ఎలా సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను గుర్తించలేదు.. ఇది దురదృష్టకరమని అన్నారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే కాదు సేవకుడిగా ఉంటానని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.
రాష్ట్రంలోని పేద వర్గాలకు జరిగిన లబ్ధి గురించి చెప్పేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర చేపట్టినట్టు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. గురువారం పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యత్రలో ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నేతలు రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 1299 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు…