కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం గుర్తుకు వస్తుందని అలాంటి కుప్పంలో అప్రజాస్వామిక విధానాలతో తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు పన్నుతు న్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార యంత్రాం గాన్ని ముందుండి నడిపిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజా తీర్పును…
వాల్టా చట్టం పై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ-సీఈడబ్ల్యుఎ నిబంధనల అమలు పై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సీఈడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును…
నేడు మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటంచనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పంచాయతీ రాజ్ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. PKM UDA (పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రమాణ స్వీకారం, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొంటారు.