రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధంలో ఇరుదేశాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఉక్రెయిన్పై ఎనిమిది రోజులుగా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించిన వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటివరకు 498 మంది సైనికులను కోల్పోయామని రష్యా ప్రకటించింది. 16 వందల మంది రష్యా సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్కు చెందిన ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చింది.…
ఉక్రెయిన్-రష్యా వార్ ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు శాంతి చర్చలకు కూడా సిద్ధం అవుతున్నారు.. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో.. బెలారస్లో రెండవ విడత శాంతి చర్చల కోసం ప్రతినిధులను పంపామని చెబుతోంది రష్యా.. అయితే, రష్యా చర్చలు జరపాలనుకుంటే వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీంతో, చర్చలు ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.. మరోవైపు, రష్యా దాడులు మొదలైన తర్వాత 9 లక్షల మందికి పైగా ప్రజలు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది. తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం…