Bunny Vas : ఇప్పుడు థియేటర్ల బంద్ పై పెద్ద రచ్చనే జరుగుతోంది. థియేటర్ల బంద్ ఉండదని నిర్మాతల మండలి ప్రకటించినా సరే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో నిప్పు రాజుకున్నట్టే అయింది. సినిమా ఇండస్ట్రీపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. స్వీకరిస్తానని చెప్పడంతో తీవ్ర కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో చాలా రాజకీయాలు ఉన్నాయని..…
టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో, చిన్న సినిమాలు లేదా క్రేజ్ లేని సినిమాలైతే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే, మల్టీప్లెక్స్లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు…
Pawan Kalyan : థియేటర్ల బంద్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికే కుట్ర చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని.. యథావిధిగా సినిమాలు ఆడుతాయంటూ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీ గౌరవ, మర్యాదలు కాపాడేందుకు తాము…
కాశ్మీర్లో యుద్ధ బాధిత కుటుంబాలకు రాహుల్గాంధీ పరామర్శ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాయాది దేశం సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాయాది సైనిక చర్యలకు జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో పూంఛ్ ప్రాంతంలో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ఒక…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. . ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా…
HHVM : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూ నిన్నటి దాకా పెద్ద రచ్చకు దారి తీసింది. థియేటర్ల బంద్ అంటే ఎగ్జిబిటర్ల నిరసన వల్ల బంద్ అవుతోంది అనే దాని కంటే.. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికే బంద్ చేస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. థియేటర్ల్ బంద్ అంటే కేవలం పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర పూరితంగా చేస్తున్నదే అన్నట్టు సోషల్ మీడియా, ఇటు మెయిన్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీరమల్లు…
జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ సినిమా మండలి కార్యవర్గ సభ్యులు అనుశ్రీ సత్యనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూన్ ఒకటో తేదీన ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదని అన్నారు
థియేటర్ల బంద్పై వెనక్కి తగ్గారు ఎగ్జిబిటర్లు.. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ జరిగింది.. ఈ సమావేశానికి దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ రవి శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సితార నాగ వంశీ, బెల్లంకొండ సురేష్, రాధ మోహన్, స్రవంతి రవికిశోర్, బాపినీడు, ఏఎం రత్నం, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.. జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల బంద్పై చర్చించారు.. ఆ తర్వాత ఓ కీలక ప్రకటన విడుల చేసింది తెలుగు ఫిల్మ్…
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్... సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హితవుచెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు.? అని ప్రశ్నించారు.