జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు, నాయకులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో సమావేశం నిర్వహించారు.
Dadisetti Raja: ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన వేళ.. ఆస్కార్కు లింక్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి దాడిసెట్టి రాజా.. పవన్ కళ్యాణ్ అలియాస్ దత్త పుత్రుడు 3 నెలల విరామం తర్వాత హడావిడి చేస్తున్నారు.. ఏపీలో బీసీ రాజ్యాధికారం అంటే కాపులు, బీసీలు కలిసి చంద్రబాబు పల్లకి మోయటమా పవన్ ? అంటూ నిలదీశారు. చంద్రబాబుతో కొత్తగా కలిసి ఉన్నట్లు రెండు రోజులుగా…
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా టీడీపీ చంద్రబాబు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శించారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్న ఏమో బీసీ అంటున్నాడని, చిరంజీవి పార్టీ పెట్టి ఓటమి చెందిన తర్వాత రోజే అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు.