Pakistan: పాకిస్తాన్ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
Jai Shankar: జమ్మూ కాశ్మీర్లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్లో న్యూస్వీక్తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి…
Rajnath Singh: ఇటీవల సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం డెహ్రాడూన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్ను ఉగ్రవాద నిరోధక ప్యానెల్కు వైస్-చైర్గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఈ ప్యానెల్ ఏర్పడింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారత సైనిక సత్తాను పాకిస్తాన్కి రుచి చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి, 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపుల తర్వాత,
‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. Also Read:Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను…
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఇరాన్లో పర్యటిస్తూ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి కోరుకునే వాళ్లు చర్చలకు రావాలంటూ వ్యాఖ్యానించారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.
Balochistan: ఓ వైపు భారత్ దాడులతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మరోవైపు, బెలూచిస్తాన్లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది. పాక్ ఆర్మీని, పంజాబ్కి చెందిన వారిని బీఎల్ఏ వెతికి వేటాడి హతమారుస్తోంది. తాజాగా, బీఎల్ఏ తాము చేసిన దాడులను వెల్లడించింది. 51 ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైన్యంపై 71 దాడులు చేశామని చెప్పింది. తాము ఏ దేశానికి కూడా ప్రాక్సీగా పనిచేయడం లేదని చెప్పింది. బీఎల్ఏ ఏ దేశానికి బంటు కాదని…
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేరుకున్నారు. ఈ దాడిపై తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. కశ్మీర్లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మతాల మధ్య యుద్ధం కాదని.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు.