P Chidambaram: కాంగ్రెస్ నేత “పాకిస్తాన్ అనుకూల” వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’..
- పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లు ఆధారాలు లేవు..
- కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలు..
- పాకిస్తాన్కి కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P Chidambaram: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కాంగ్రెస్ పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎల్లప్పుడు శత్రువులను రక్షించడానికి ఉంటుందని విమర్శించింది.
ది క్వింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాజీ హోం మంత్రి మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదని అన్నారు. ‘‘వారు ఉగ్రవాదుల్ని గుర్తించారా..? వారు ఎక్కడ నుంచి వచ్చారు..? నా ఉద్దేశ్యం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు..? దానికి ఆధారాలు లేదు’’ అని ఆయన అన్నారు.
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
Read Also: Donald Trump: అప్పుడు భారత్-పాకిస్తాన్, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా..
పహల్గామ్ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి, పాక్ లోని ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 11 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. అయితే, ఆపరేషన్ సిందూర్లో ప్రభుత్వం నష్టాలను దాచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఎన్ని నష్టాలను చవిచూసినా, దానిని స్పష్టంగా చెప్పందని, యుద్ధంలో నష్టాలు అనివార్యమైనవని, ప్రభుత్వం నష్టాలను అంగీకరించాలని ఆయన అన్నారు.
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ‘‘యుపిఎ హయాంలో హోం మంత్రిగా పనిచేసిన పి. చిదంబరం, అపఖ్యాతి పాలైన ‘కాషాయ ఉగ్రవాదం’ సిద్ధాంతానికి మూల ప్రతిపాదకుడు, మరోసారి తనను తాను కీర్తించుకున్నారు’’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్లో ట్వీట్ చేశారు. మరోసారి పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ తొందరపడుతోందని, కాంగ్రెస్ నాయకులకు భారతదేశ ప్రతిపక్షం కన్నా ఇస్లామాబాద్ రక్షణ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చకు ముందే కాంగ్రెస్ పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చిందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?