పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఓటింగ్ జరగనుండగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు సైన్యం మద్దతు ఉందని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఎన్నికల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న జంట బాంబు పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు.
Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు పాకిస్తాన్ ఉగ్రదాడులతో నెత్తురోడుతోంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ జంట పేలుళ్లలో 22 మంది మృతి చెందారు. గురువారం ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన భద్రతపై ఆందోళన పెంచుతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల విజయాన్ని పాకిస్తాన్లోని అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, అవినీతి, పన్నుల నుంచి విముక్తి కల్పిస్తామని 2014లో నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానం చేశారు. అప్పుడు భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Imran Khan: పాకిస్తాన్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ ఎన్నికలు వస్తున్నా్యి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నాడు. ఇప్పటికే అక్కడి కోర్టులు అతనికి పలు కేసుల్లో జైలుశిక్ష విధించాయి. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్కు కొద్ది రోజుల ముందు తన ఎన్నికల చిహ్నాన్ని కూడా కోల్పోయింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరుపున…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. ఇటీవల ఇరాన్ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్పై దాడులు చేసింది, దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. దీని తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున మిలిటరీ విన్యాసాలు చేయడంతో పాటు పాక్ సరిహద్దు వైపు కదులుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్లో అంతర్గతంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో సతమతమవుతోంది.
పాకిస్థాన్లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కకర్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
Dr Saveera Parkash: డాక్టర్ సవీరా ప్రకాష్ పేరు ఇప్పుడు పాకిస్తాన్ లోనే కాదు ఇండియాలో కూడా ఫేమస్ అయింది. ఫిబ్రవరిలో పాకిస్తాన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సవీరా ప్రకాష్ నిలిచారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాక్ వంటి దేశంలో ఓ హిందువు అదికూడా ఓ మహిళ ఎన్నికల బరిలో నిలబడటం చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయగలరా.. అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్పై సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది.
ఉగ్రదాడి సూత్రధారి, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పాకిస్థాన్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్లోని ప్రతి జాతీయ, ప్రావిన్సు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు సమాచారం.
Pakistan : బ్యూరోక్రసీ నుండి రిటర్నింగ్ అధికారులు (RO), జిల్లా రిటర్నింగ్ అధికారుల (DRO) నియామకాన్ని నిషేధించిన లాహోర్ హైకోర్టు ఉత్తర్వును పాకిస్తాన్ సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.