అయితే, పేజర్లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు.
Lebanon Hezbollah: లెబనాన్ లోని సాయుధ సమూహం హిజ్బుల్లా సభ్యుల పేజర్లు, వాకీ టాకీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో సంభవించిన పేలుళ్లపై సంస్థ అంతర్గత సైనిక విభాగం యొక్క రహస్య నివేదిక వెలుగులోకి వచ్చింది. 131 మంది ఇరానియన్లు, 79 మంది యెమెన్లతో సహా ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలలో పేలుళ్ల వల్ల 879 మంది హిజ్బుల్లా సభ్యులు మరణించారని నివేదిక పేర్కొంది. ఇందులో 291 మంది సీనియర్ అధికారులు మరణించారు. ఈ నివేదికను హిజ్బుల్లా నాయకుడు సయ్యద్…