Tragedy : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే యువత అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న దారుణ ఘటనలకు బలైపోతున్నారని తాజా ఉదాహరణ మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డాలస్ నగరంలో కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. డాలస్లో నివాసం తీసుకొని చదువుకుంటూ, అదనంగా ఒక పెట్రోల్ బంక్లో పార్ట్టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నారు.…
ప్రముఖ విదేశీ విద్యా సంస్థ సౌర్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025” హైదరాబాద్లోని JNTU బ్రాంచ్, KPHB (పిల్లర్ నం: A-724) వద్ద ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో విద్యార్థులకు ప్రపంచంలో ప్రముఖ దేశాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాల గురించి సమగ్ర సమాచారం అందించనున్నారు.…
Study Abroad: ‘విదేశీ విద్య’కు ఇండియాలో తామే మారుపేరుగా నిలవాలనుకుంటున్నామని యూని2గో(Uni2Go) అనే స్టార్టప్ కోఫౌండర్లలో ఒకరైన రితికా రెడ్డి అన్నారు. తన తండ్రి గత 21 ఏళ్ల నుంచి స్టడీ అబ్రాడ్ కౌన్సిలర్గా చేస్తున్నారని, ఫారన్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరకు వస్తుండేవారని చెప్పారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి వాళ్లలో ఎన్నో సందేహాలు ఉండేవని, తన తండ్రిని అడిగి నివృత్తి చేసుకునేవారని తెలిపారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టార్టప్కి రూపకల్పన